తూప్రాన్ మండల జడ్పిటిసి రాణి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్ రామ్ రెడ్డి మద్దతుగా జోరుగా ఇంటింటి ప్రచారం.

 

మెదక్ ఎంపీ సీటు మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది –

దాతర్ పల్లి గుండ్రెడ్డిపల్లి గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల ఎన్నికల ప్రచారం,

తూప్రాన్ మే 2 ప్రజాబలం న్యూస్ న్యూస్ :-

మెదక్ ఎంపీ సీటు మళ్లీ బిఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని తూప్రాన్ మండల జడ్పిటిసి బసవన్న గారి రాణి సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ బిజెపి నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని గ్రామాలను అభివృద్ధి చేసిన కేసీఆర్
టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థివెంకట్రాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లకు సూచించారు. గురువారం తూప్రాన్ మండలంలోని
దాతర్ పల్లి, గుండ్రేడ్పల్లి గ్రామాలలో పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి పార్టీ కరపత్రాలను పంచుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. గ్రామాల్లో జరుగు తున్న ఉపాధి పనుల వద్దకు వెళ్లి అక్కడ పనిచేస్తున్న కూలీలను ఓట్లను అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ నాయకులు ఎంపీటీసీ సంతోష్ రెడ్డి,శేరినరసింహారెడ్డి,
బొల్లంపల్లి బబుల్ రెడ్డి,రమేష్, కృష్ణారెడ్డి, మైపాల్ , రమేష్ యాదవ్, నవీన్, ఆంజనేయులు గౌడ్, శ్రీనివాస్ గౌడ్,
బద్దం మహేష్ పటేల్ ,మహమ్మద్ అహ్మద్ ,రవి, మహేష్ యాదవ్ ,బి ఆర్ ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Comments (0)
Add Comment