యాదాద్రి ప్రజాబలం ప్రతినిధి:రాజ్య సభ నుండి 10 మంది ఎంపీలు, లోక్ సభ నుండి 21 మంది ఎంపిలతో కూడిన కమిటీని గురువారం రాత్రి పార్లమెంటరీ బులిటెన్ లో ప్రకటించారు.
ఈ కమిటీకి ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చైర్మన్ గా వ్యవహారిస్తారు.తెలంగాణ రాష్ట్రం నుండి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కమిటీ సభ్యులు గా ఉంటారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అమలు,గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల కేంద్ర మంత్రిత్వ శాఖ పని తీరు, పరిశీలన వ్యవహారాలకు ప్రతినిధిగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు