ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు 100% పూర్తి చేస్తాం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

 

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 23 (ప్రజాబలం) ఖమ్మం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు వంద శాతం పూర్తి చేస్తామని రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్ సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు కూసుమంచి మండలం పాలేరు గ్రామంలోని బి.వి. రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి, క్రిస్టమస్ బహుమతుల పంపిణీ పాలేరు నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మి/శాదిముబారక్ లబ్ధిదారులకు చెక్కులు, విద్యుత్ ప్రమాదంలో మృతిచెందిన వారి సంబంధికులకు ఎక్స్ గ్రేషియా చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని తెలిపారు. అనేకమంది ఇండ్లు అడుగుతున్నారని, ధరణి తో ఇబ్బందులు పడుతున్నారని, ఇండ్ల మంత్రిగా, రెవిన్యూ మంత్రిగా అందరికి న్యాయం చేస్తామన్నారు. ప్రతి ఇంటికి ఆరు గ్యారెంటీలు తీసుకొని వెళ్లారని ఆయన అన్నారు. హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ లను తప్పక నెరవేర్చుతామని అన్నారు. అక్రమ కేసులు అన్నింటినీ పరిష్కరిస్తామన్నారు ఆరు గ్యారెంటీ లను వంద రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పామని తెలిపినట్లు, ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేసినట్లు ఆయన అన్నారు. రెండు మూడు రోజుల్లో తీపి వార్త వింటారని, హామీల్లో కొన్ని అమలుచేయనున్నట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వం ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల 734 కోట్ల రూపాయల అప్పులు చేసిందని ఆయన అన్నారు. ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పిన గత ప్రభుత్వం 81 వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ఒప్పచెప్పినట్లు మంత్రి అన్నారు. ఎన్ని అప్పులు ఉన్న, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఆయన అన్నారు. గతంలో ఆగి పోయిన పనులకు సంబంధించి, అధికారులకు సూచనలు చేసినట్లు ఆయన తెలిపారు. ఏ ఒక్క అధికారికి డబ్బులు తీసుకుని పోస్టింగ్ లు ఇవ్వమని, ప్రజల నుంచి అధికారులు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పని చేయాలని, మంచి పరిపాలన అందించాలని మంత్రి అన్నారు. ప్రజలు కోరుకునే ఇందిరమ్మ రాజ్యం కోసం అధికారులు కలిసికట్టుగా పనిచేయాల న్నారు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మంత్రి కేక్ కట్ చేశారు ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, ఎస్డీసి ఎం. రాజేశ్వరి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి మహమూది, విద్యుత్ శాఖ ఎడిఇ కొక్యా నాయక్, పాలేరు నియోజకవర్గ మండలాల తహశీల్దార్లు, ఎంపిడిఓ లు, ఎంపిపి లు, జెడ్పిటిసిలు, సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking