జాతీయ జెండా ఎగురవేసిన జిల్లా జడ్జి బి ప్రతిమ.

75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి ప్రతిమ జాతీయ జెండాను ఎగరవేశారు. శుక్రవారం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి పోలీస్ కవాతులు స్వీకరించి, మహాత్మా గాంధీ, డా. అంబేద్కర్ ల ఫోటోలకు దండలు వేసి అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి రఘునందన్ రావు, లింగంపల్లి నాగరాజు, జిల్లా అదనపు న్యాయమూర్తులు, మెజిస్టేట్లు, కార్యవర్గ సభ్యులు,సీనియర్ ,జూనియర్ న్యాయవాదులు , మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన న్యాయవాదులకు జిల్లా జడ్జి, అదనపు జిల్లా జడ్జిల చేతుల మీదుగా బహుమతులు ప్రధానం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking