ప్రసూతి మరణాలు తగ్గించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వైద్యాధికారులను ఆదేశించారు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,జిల్లాలో ప్రసూతి మరణాలు తగ్గించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు నమోదైన ప్రసూతి మరణాలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ మహిళలకు పరీక్షలు నిర్వహిస్తూ రక్తహీనత, పోషకాహార లోపాలను గుర్తించి అవసరమైన వారికి ఐరన్, కాల్షియం మాత్రలు అందించాలన్నారు. పోషకాహారం పట్ల గర్భిణుల్లో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ఏఎన్ఎం, ఆశ, అంగన్వాడి టీచర్లతో గర్భిణులకు మానసిక ఆరోగ్యం పై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. హైరిస్క్ కేసులు ఉన్న గర్భిణులను గుర్తించి అవసరమైన చికిత్సను అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు.అన్ని ఆసుపత్రుల వద్ద కట్టుదిట్టమైన భద్రతను కొనసాగించాలన్నారు. ఆసుపత్రిలోని సీసీ కెమెరా నిఘాలో పర్యవేక్షించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నిరంతరం నియంత్రణ చర్యలు కొనసాగించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు నమోదైన డెంగ్యూ, ఇతర విష జ్వరాలకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు
ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి రాజేందర్, వైద్యాధికారులు సురేష్,సౌమ్య, వైద్యులు,ఇతర అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking