ప్రజలకు న్యాయం చేస్తున్న యువకుడి పై తప్పుడు ఆరోపణల – మన్నే సాయిచరణ్….

 

కొల్చారం, అక్టోబర్ 24( ప్రజాబలం):-

మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగయ్య పేట గ్రామానికి చెందిన మన్నె సాయిచరణ్ ప్రజల కోసం సేవ చేస్తే, ఆపదలో ఉన్నవారికి ఆదుకుంటే ఒక చానల్లో తప్పుడు ప్రచారాలు రాస్తున్నారని మన్నే సాయిచరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కొల్చారం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ చేయడం తప్ప… ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం చేయడం నేరమా…అని ఆయన అన్నారు. నేను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ప్రజలకు సేవ చేయడానికి నాకు ఎంతో ఇష్టమని, నేను ఏమైనా తప్పు చేస్తే నిరూపించి చట్టపరమైన చర్య తీసుకోవాలని, ప్రజల్లో ఉండి ప్రజాసేవ చేస్తే లేనిపోని ఆరోపణలతో వార్తలు రాయడం ఎంతవరకు సమంజసం అని సాయి చరణ్ ప్రశ్నించారు. నాపై ఏదైనా తప్పుడు ఆరోపాలు ఉంటే వెంటనే రుజువు చేయాలని సాయి చరణ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking