మెదక్ జిల్లా ప్రజాబలం ప్రతినిధిచేగుంట మండలం బోనాల కొండాపూర్ గ్రామంలో హత్ సే హత్ జూడో యాత్ర లో భాగంగా… దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తిక గౌడ్,మహిళలతో ముచ్చటించి సమస్యలను, అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీ, ఆడబిడ్డలకు 500 రూపాయల కే గ్యాస్ సిలిండర్,ఇందిరమ్మ ఇంటికి 5 లక్షల సాయం, ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనీస పెన్షన్ 5000 రూపాయలు, మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజక్క, సంజీవ్, బండి స్వామి, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు