ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 12 : ఆడపడుచులకు పండుగ కనుక గా చీరలు పంపిణీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ-ప్రేమ్ సాగర్ రావు పంపిణీ,మంగళవారం ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షురాలు మాట్లాడుతూ…మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలో రెబ్బనపల్లి,చింతపల్లి, తనిమడుగు,కుందేలాపాడు నెల్కి వెంకటాపూర్,గ్రామాల్లో కీ,శే, కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చైర్మన్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ పండుగ కానుకగా చీరల పంపిణీ చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఎంపిపి గడ్డం శ్రీనివాస్,ఎంపిటిసి లు వనపర్తి మల్లిక- రవి, మనేమ్మ,మండల అధ్యక్షుడు అక్కల వెంకటేష్,నాయకులు సుభాష్,అక్కల శకుంతల, సర్పంచ్ లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.