డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్ పొందుటకు అక్టోబర్ 30 వరకు పొడిగింపు

 

ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ అక్టోబర్ 19 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్ పొందుటకు అక్టోబర్ 30 వరకు పొడగించారని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లెర్నర్ సపోర్ట్ సెంటర్ 232 లక్షెటిపేట సమన్వయకర్త ప్రిన్సిపల్ డాక్టర్ మహాత్మా సంతోష్ ఒక ప్రకటనలో తెలియజేశారు అడ్మిషన్ పొందుటకు ఇంటర్మీడియట్, ఒకేషనల్ ఇంటర్మీడియట్, ఐటిఐ పూర్తి చేసినవారు అర్హులని l. రిజిస్ట్రేషన్ కొరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆన్లైన్ వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు పూర్తి వివరాలు కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లక్షెట్టిపేట అధ్యయన కేంద్రంలో(232) సంప్రదించాలని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking