ఫిబ్రవరి 23 తెలంగాణ వంజరి సామాజిక వర్గానికి చీకటి దినం

 

జీఓ నం: 44,23.02. 1979 రాష్ట్ర వంజరులకు తీరని అన్యాయం.

తెలంగాణ వంజరులను ఎస్టీ సుగాలి సంచారజాతి లో పునరుద్ధరించాలి.

కాలేరు వెంకట రమణ వంజరి. (ఎ.బి.వి.యస్.యస్ తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి)

తెలంగాణ రాష్ట్రంలో గత 43 సంవత్సరాలుగా వంజరి సామాజిక వర్గ ప్రజలు జీవో నంబర్ 44 తేదీ 23.02.1979 ద్వారా తీరని అన్యాయం జరిగిందని సామాజిక,ఆర్థిక,విద్య,ఉపాధి రంగాల్లో వెనుకబాటుతనం అనుభవిస్తూ ఎదుగుబోదుగు లేకుండా తమ హక్కులైన రాజ్యాంగ అభివృద్ధి, ప్రగతి ఫలాలకు అప్పటి ప్రభుత్వం దూరం చేసిందని విమర్శించారు. ఈమేరకు ఆకుల సామాజిక వర్గ అఖిల భారత వంజరి సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కాలేరు వెంకటరమణ వంజరి విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

వంజరులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచార తెగకు చెందిన జాతిగా ఉండేవారని. వారు గతంలో అడవి ప్రాంతాలలో నివాసం ఏర్పాటు చేసుకొని జీవనం సాగించేవారని అన్నారు. వంజరులు సాంఘీకంగా, ఆర్ధికంగా మరియు రాజకీయంగా ఎంతో వెనుకబడి దయనీయ జీవనం గడుపుతున్న తరుణంలో వారి ఆచార వ్యవహారాలను , సంస్కృతి , నాగరికతను వారి జీవన విధానాన్ని బట్టి ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతం సంచరిస్తూ బతికే సంచార జాతిగ గుర్తించి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో అప్పటి ప్రభుత్వం జీ.ఓ నంబర్ 245 తేది: 30.06.1977 లో ఎస్టీ జాబితాలోని సుగాలి తెగలో చేర్చిందని వివరించారు. అయితే తిరిగి 1979 లో ఫిబ్రవరి 23 న జీ.ఓ.నంబర్ 44 ద్వార తమ హక్కులని కాలరాస్తు అన్యాయంగా ఏ ఉన్నత చదువుల్లో,రాజకీయాల్లో రాణించని అమాయక వంజరి కుల సమాజికవర్గాన్ని చడీచప్పుడు లేకుండా బీసీ ”డి” క్రమసంఖ్య 32 గా మార్చివేశారని వంజరి సామాజిక వర్గ ఎదుగుదలకు విద్రోహం చేసారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాంగం కల్పించిన
వంజరుల హక్కులకు అభివృద్ధి, ప్రగతి ఫలాలకు దూరం చేయడం వల్ల ఉన్నత చదువులకు విద్య,ఉపాధి రంగాలలో వెనుకబడి రాష్ట్రవ్యాప్తంగా వంజరులు అనేకమంది కులానికి ప్రత్యేక గుర్తింపు గల వృత్తి లేకపోవడంతో హమాలీ కూలీలు గా దుకాణాల్లో ఆర్డినరీ లేబర్లు గా గుమస్తాలుగా,రైతు కూలీలుగా,అక్కడక్కడా రైతులుగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.అయితే తమ హక్కులను కాలరాస్తూ అభివృద్ధి చెందడానికి అవకాశం లేకుండా జీ.ఓ 44 తెచ్చిన రోజు ఫిబ్రవరి 23 ను రాష్ట్ర వంజరి సమాజం మొత్తం బ్లాక్ డే గా పరిగనించి రాష్ట్ర వ్యాప్తంగా మండల,జిల్లా కేంద్రాల్లో నిరసనను తెలియజేస్తూ పూర్వపు జీవో నంబర్ 245 తేదీ 30.06.1977లో కలిపేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వంతో మరియు న్యాయస్థానం ద్వారా ఎంత న్యాయపోరాటం చేసినా ఎలాంటి ఫలితం రాలేదని
2021 లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాదా ఇదాయతె కమిటికి తెలంగాణ వంజరి రిజర్వేషన్స్ రిసాల్వింగ్ కమిటి ప్రధాన కార్యదర్శి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పొతనకర్ లక్షినారాయణ వంజరి వంజరి వర్గం రిజర్వేషన్స్ కొరకు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని
తెలంగాణ ప్రభుత్వం వంజరి కులానికి అనుకూలంగ వారి హక్కులను కాపాడుతూ రిపోర్ట్ ను కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా మెలిక పెట్టి షెడ్యులు తెగల్లోని ఒక సామజికవర్గానికి తెలంగాణ ప్రభుత్వం కొమ్ముకాసే విధంగా వ్యవహారించిందని తెలంగాణ వంజరి సామజిక వర్గానికి మొండిచెయ్యి చూపిందని వెంకటరమణ వంజరి రాష్ట్ర ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు . ఎస్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ లో మొదటి నుండి ఆధిపత్యం చేలాయిస్తున్న వారి మంద బలానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాసోహం అయ్యింది అనడానికి ఇది నిదర్శనం అని ఆయన తీవ్రంగా విమర్శించారు.తిరిగి వంజరి సంచార జాతి కోల్పోయిన రిజర్వేషన్ పుణరుద్దరణ జరిగే వరకు వంజరులు ఉద్యమించాలని ఈసందర్భంగా వెంకటరమణ వంజరి పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking