గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి: గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గ పరిసర ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్ర విశిష్ట పండుగ, బోనాల పండుగ సందర్భంగా నిర్వహించిన తొట్ల కార్యక్రమానికి, పలహారం బండి జుల కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా గడ్డం శ్రీనివా స్ యాదవ్ (గ్రంధా లయ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ గోషామహల్ అసెంబ్లీ సీనియర్ నాయకుడు) హాజర య్యారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్ తో పాటు ప్రముఖ బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ గోషామహల్ అసెంబ్లీ నియోజక వర్గ ప్రజలను అమ్మవారి ఆశీస్సుల తో అభివృద్ది పదంలోనడుస్తూ చల్లగా ఉండాలని అమ్మవారిని కోరినాని అన్నారు.