ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 10:
మంచిర్యాల జిల్లా నస్పూర్ లో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన బాడీ బిల్డింగ్ పోటీల్లో సుమారు 100 మంది పైగా జిల్లాల నుంచి పోటీ దారులు పాల్గొనగా మందమర్రి చెందిన అక్షయ్ 70 వెయిట్ విభాగంలో మొదటి బహుమతి సాధించిన సందర్భంగా మందమర్రి పట్టణ యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మంద తిరుమలరెడ్డి, రాయబారపు కిరణ్, బియ్యపు రవికిరణ్ యాదవ్ మండల యువజన కాంగ్రెస్ కార్యదర్శి సోషల్ మీడియా ఇన్చార్జిలు సురేందర్, అన్వేష్, పసునూరి రాము, మణిదీప్, చింటూ, ఆంజనేయులు తదితర యువ నాయకులు పాల్గొన్నారు.