హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రారంభోత్సవం రెండో పంపు వద్ద
ప్రారంభోత్సవ కార్యక్రమ పర్యవేక్షణకు నోడల్ అధికారి
వైరాలో భారీ బహిరంగ సభ
-నీటిపారుదలశాఖ అధికారుల సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రజాబలం ప్రతినిధి: భద్రాద్రికొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో నిర్మించిన సీతారాం ప్రాజెక్ట్ ను ఈ నెల 15 న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి యన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై జలసౌద లో ఆయన నీటిపారుదల అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.నీటిపారుదల శాఖా కార్యదర్శి రాహుల్ బొజ్జ,సహాయ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ ఇ. యన్. సి లు అనిల్ కుమార్,నాగేందర్ రావు,డిప్యూటీ ఇ. యన్. సి కే.శ్రీనివాస్ తదితరులు ఈ సమీక్ష లో పాల్గొన్నారు. ఆ రోజు ఉదయం రాష్ట్ర రాజధానిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల అనంతరం హెలికాప్టర్ ద్వారా నేరుగా ఖమ్మం జిల్లా వైరా కు ముఖ్యమంత్రి చేరుకుంటారని ఆయన తెలిపారు. అక్కడే భోజనాలు పూర్తి చేసుకుని అనంతరం వైరాలో జరగనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని ఆయన చెప్పారు.ప్రాజెక్ట్ రెండో పంప్ హౌస్ నుండి ఈ ప్రాజెక్ట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంబిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.మొత్తం ఈ కార్యక్రమ పర్యవేక్షణకు గాను ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడిరచారు.తిరిగి సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఆనవాయితిగా ఏర్పాటు చేసే తేనీటి విందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని ఆయన తెలిపారు.
Prev Post