రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్స్ అందించిన నాచారం సీఐ

 

ప్రజాబలం ప్రతినిధి ఉప్పల్ అక్టోబర్ 22:పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఎస్ ఎస్ యువసేన, మాజీ సైనికుడు, కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నాచారం కు చెందిన పలువురు యువకులు పాల్గొని రక్త దానం చేశారు. రక్తదానం చేసిన యువకులను నాచారం ఇన్స్పెక్టర్ రుద్విర్ కుమార్ అభినందించి వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో లోకేందర్ రెడ్డి, రమాకాంత్ లోకే, రమేష్ పటేల్, సునీల్ బాబు, కృష్ణ కిషోర్ రెడ్డి, శ్రీధర్, సాయి ప్రసాద్ రెడ్డి, గురు, విజయ కుమార్ సింగ్, ఏ శ్రీధర్, శివ, మహేష్ రెడ్డి, శ్రీకాంత్, సాత్విక్ రెడ్డి, శ్రీతన్ రెడ్డి, నవీన్, సందీప్, అబ్రహం, సేభాష్టియన్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking