ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏప్రిల్ 30:
తార్నాక నారాయణ ఈ-టెక్నో పాఠశాల విద్యార్థులు
పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ఘనవిజయం
సాధించారు. 14 మంది విద్యార్థులకు 10 జిపిఏ సాధించగా, 10 మంది విద్యార్థులకు 9.8 జిపిఏ సాధించారు. పాఠశాలలో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పాఠశాల జిఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం బాల పరమేశ్వర్ లు ప్రశంసించారు. ప్రిన్సిపాల్ పర్వేన్ మాట్లాడుతూ విద్యార్థుల యొక్క
కృషి, పట్టుదల ఉంటేనే ఏదైనా సాధించగలరనీ అన్నారు దీనికి తోడు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఉంటేనే ఇంకా
వారు భవిష్యత్తులో ఇలాంటి విజయాలు సాధిస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో పదవ తరగతి తెలంగాణ ఇంచార్జ్
ముంతాజ్, హెడ్. శివరంజని, హైస్కూల్ కో-ఆర్డినేటర్ ఆజాద్, ఏడి సురేష్, ఏవో మహేందర్ పదవ తరగతి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు మహేందర్ పాల్గొన్నారు