ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ ఫిబ్రవరి 13 చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం గ్రామ శివారులో ఆర్కేపల్లి దారిలో గుడుంబా కాస్తున్నట్టు నమ్మదగిన సమాచారం మేరకు గురువారం ఎక్సైజ్ అధికారులతో కలిసి దాడి చేసినట్లు భీమారం ఎస్సై శ్వేత తెలిపారు. ఆ ప్రాంతంలో రెండు లీటర్ల గుడుంబా, సుమారు 70 లీటర్ల బెల్లం పానకం, గుడుంబా తయారీకి సంబంధించిన ముడి సరుకు లభించినట్లు ఆమే తెలిపారు. ఈ దాడిలో కానిస్టేబుల్ సత్తిరెడ్డి, అశోక్, నిహల్, రాజకుమార్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ రాజేంద్రప్రసాద్, ప్రసాద్ లు పాల్గొన్నారు.