నేడే గిరిజనోత్సవం

 

జిల్లాలోని 94 గిరిజన గ్రామపంచాయతీలలో గిరిజనోత్సవం

…జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, జూన్ 16 ప్రజ బలం ప్రతినిది:
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం(జూన్ 17న ) తెలంగాణ గిరిజనోత్సవాన్ని జిల్లాలోని 94 గిరిజన గ్రామపంచాయతీలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయా గ్రామాలలో గిరిజనులు వారి వారి సాంప్రదాయ పద్ధతిలో ఊరేగింపుగా అమ్మవారి దేవాలయానికి , సేవాలాల్ మహారాజ్ దేవాలయం నకు వెళ్లి పూజలు నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం గ్రామసభ నిర్వహించి, తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సందేశాన్ని చదివి వినిపిస్తారని తెలిపారు. గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి ప్రజలకు తెలియజేస్తారన్నారు. నూతనంగా మంజూరైన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఆయా గ్రామ పంచాయతీలలో పదవ తరగతిలో 10/10 జి పి సాధించిన విద్యార్థులను, ఉన్నత పదవిలో ఉన్న అధికారులను గుర్తించి సన్మానిస్తారని పేర్కొన్నారు.
కంది మండలం వడ్డేన గూడ తాండ గ్రామపంచాయతీ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ ఈ. శ్రీధర్ పాల్గొననున్నట్లు తెలిపారు.
జిల్లాలోని గిరిజన గ్రామ పంచాయతీలలో నిర్వహించు గిరిజనోత్సవంలో ప్రజా ప్రతినిధులు, ప్రజలు, అన్ని వర్గాల వారు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు

Leave A Reply

Your email address will not be published.

Breaking