జూన్ 10న జిల్లా మహాసభలు, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్రా ప్రధాన కార్యదర్శి బస్వపున్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణ,
వనపర్తి ప్రజాబలం ప్రతినిధి:(మే 31) జర్నలిస్టుల సమస్యలపై పోరాడేది టీడబ్ల్యూజేఎఫ్ సంఘం ఒకటేనని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బస్వపున్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ కృష్ణలు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వారు ముఖ్య అథితులుగా విచ్చేసి సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రసంగించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రధాన సమస్యలైన వైద్యం,అక్రిడేషన్ కార్డులు,ఇండ్లు తదితర సమస్యలపై సంఘం తీవ్ర స్థాయిలో కృషి చేస్తుందని వారు అన్నారు.ముఖ్యంగా జర్నలిస్టులు అందరు కూడా అక్రిడేషన్ కార్డుల కంటే సంస్థ ఇచ్చిన ఐడి కార్డుల ప్రధానమని,ఈ విషయాన్ని ప్రతి జర్నలిస్టు గమనించాలని వారు అన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని,అలాగే చిన్న పత్రికల పరిస్థితి మరీ దారుణంగా ఉందని వారన్నారు. ఈ పరిస్థితుల్లో జర్నలిస్టులంతా కలిసికట్టుగా ఉండి సమస్యల సాధన కోసం పాటుపడాలని వారన్నారు.అలాగే జిల్లా సంఘ సభ్యులందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు అన్నారు. ముఖ్యంగా జూన్ 10న జిల్లా మహాసభలు నిర్వహించనున్న సందర్భంగా ప్రతి జర్నలిస్టు కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తిచేసి మహాసభలకు సమాయత్తం కావాలని వారు పిలుపునిచ్చారు. సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షులు సురేందర్ గౌడ్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు వి.అశోక్ కుమార్, పరిపూర్ణం.నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు రామచంద్రయ్య,జిల్లా కార్యదర్శి పెద్దగారి స్వామి శ్రీనివాస్ గౌడ్ రాము. వెంకట్ వెంకట్ మరియు జిల్లాలోని టీడబ్ల్యూజేఎఫ్ సంఘ సభ్యులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాసభల నిర్వహణకు జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో పాటు శ్రీనివాస్ గౌడ్ రాము తో ఐదు మంది కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఆధ్వర్యంలో మహాసభ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు