ప్రజాబలం ప్రతినిధి మంచిర్యాల జిల్లా డిసెంబర్ 28: మంచిర్యాల పట్టణంలోని కార్తికేయ హాస్పిటల్ ఎండి డాక్టర్ సుంచు రాజ్ కిరణ్ జెన్మదినం సందర్భంగా,ఆయన మిత్రులు బుధవారం జనని బ్లడ్ బ్యాంక్ లో యాబై మంది రక్తదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన సోదరుడు సుంచు జగదీష్ మాట్లాడుతూ…ఆపదలో ఉన్న పేదవారు అన్న పిలిస్తే పలికే మా అన్న తన హాస్పిటల్ లో ఎంతోమందికి ఉచితంగా వైద్యమందించి ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న మా అన్న సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆయన జెన్మదిన సందర్భంగా ఈరక్తదానం చేస్తున్నామని ఆయన అన్నారు. మునుముందు కూడా మంచి కార్యక్రమాలు చేయాలని ఆయనను కోరారు నా పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ సుంచు రాజు కిరణ్ మాట్లాడుతూ….రక్తదానం చేసిన మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మిత్రులు రాకేష్ మహేష్ సురేష్ గోపి రాము రాజు మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.