ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 15 : ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన సందర్భంగా వైఎస్సార్ టీపీ షర్మిల నాయకులు ముందస్తు అరెస్టులు చేయడం జరుగుతుంది. బుధవారం ఈ సందర్భంగా టీపీ వైయస్సార్ మంచి మంచిర్యాల నియోజకవర్గం కోఆర్డినేటర్ కారుకూరి సురేందర్ మాట్లాడుతూ...హరీష్ రావు పర్యటనను అడ్డుకుంటామని తెలుసుకొని పోలీసులు అక్రమ అరెస్టు చేస్తున్నారు.ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకలు అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం,ప్రజలు అందరు గమనించి అరెస్ట లను అర్దం చేసుకొని ఇప్పుడున్న బిఆర్ ఎస్ పార్టీకి 2024 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని అని అన్నారు,మంచిర్యాల మైనారిటీ అధ్యక్షుడు సయీద్ హది తదితరులు ఉన్నారు.