— మద్దత్తు పలికిన వామ పక్షాలు
– రాబోయే రోజుల్లో ఆందోళనలు ఉదృతం
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 16 : పంట సాగు నీటి కోసం సంక్రాంతి పండుగ పూట రైతన్నలు రోడ్డెక్కారు.కడెం చివరి ఆయకట్టు భూముల వరకు నీరు అందక ఎండిపోతున్నాయని ఆందోళనకు దిగారు.లక్షెట్టిపేటలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద 63 వ జాతీయ రహదారి పై జలసాధన సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో చేసారు.ఈ సందర్బంగా జిల్లా జల సాధన సమితి నాయకుడు నైనాలా గోవర్ధన్ మాట్లాడుతూ…. వారి నాట్లు వేసుకున్న కడెం చివరి ఆయకట్టున ఉన్న లక్షెట్టిపేట, దండేపల్లి,హాజీపూర్ మండలాల్లో పంటలకు నీరందక ఎండిపోతున్నాయాన్నారు.గూడెం లిఫ్ట్ ద్వారా చివరి ఆయకట్టుకు నీరందించే విషయంలో స్థానిక అధికార పార్టీ నాయకత్వం విఫలమైందన్నారు.గూడెం లిఫ్ట్ ప్రారంభించినప్పటి నుండి సాంకేతిక సమస్యలు,తరచూ పైప్ లైన్ పలగడం లాంటి సమస్యలతోనే సరిపోతున్నదని అన్నారు.
గతం లో ఈ సమస్య అసెంబ్లీ వరకు వెళ్లిందని అప్పుడున్న నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం త్వరలోనే చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చారన్నారు.ఏండ్లు గడుస్తున్నా రైతుల సమస్యలు, సమస్యలు గానే మిగిలి పోతున్నాయాన్నారు.శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుండి కడెం ప్రాజెక్ట్ లోనికి నీటిని విడుదల చేసి కడెం చివరి ఆయకట్టు భూముల వరకు సాగు నీరు అందించే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసారు. నీటి విడుదల గురించి రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని నీటి పారుదల శాఖ అధికారులను పట్టుబాట్టారు. లేని పక్షంలో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళన సుమారు రెండు గంటలకు పైగా సాగింది. రోడ్డుకు ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. స్థానిక పోలీసులు,నీటిపారుదల శాఖ అధికారులు ఇక్కడికి చేరుకొని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడం తో ఆందోళన విరమించారు.ఈ ఆందోళన లో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు మద్దత్తు తెలిపారు. పలు పార్టీల నాయకులు,పింగిలి రమేష్,అన్నం చిన్నయ్య,నలిమెల రాజు,అంకతి,ముద్దసాని వేణు, శ్రీనివాస్,హరిగోపాల్,కోణ కిరణ్, వివిధ పార్టీల నాయకులు,వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.