పోలీసుల నిర్లక్ష్యం భూకబ్జాదారుని ఆగడాలకు పురుగుల మందుతాగి రైతు ఆత్మహత్యాయత్నం

 

చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రైతు ఏలేటి వెంకటరెడ్డి

మంత్రి పొంగులేటి ఇలాకాలో ఘటన

మాజీ నక్సలైట్ పేరుతో జాటోత్ వీరన్న దౌర్జన్యంగా భూకబ్జాలు

ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నా కూడా పట్టించుకోని ఖమ్మం రూరల్ పోలీసులు

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 4 (ప్రజాబలం) ఖమ్మం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇలాకాలో సన్నా, చిన్న కారు రైతు ఏలేటి వెంకటరెడ్డి(45), మాజీ మావోయిస్టు, భూకబ్జాదారుడు జాటోత్ వీరన్న ఆగడాలకు వెంకటరెడ్డి పొలం వద్దనే పురుగుల మందు తాగి చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఖమ్మం రూరల్ మండల పోలీసుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడుపాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం, జాన్ పహాడ్ తండాకు చెందిన ఏలేటి వెంకట్ రెడ్డి తనకున్న మూడె కరాలలో భూమిని సాగు చేసుకుంటున్న క్రమంలో వెంకట్ రెడ్డి సోదరుడు భూపాల్ రెడ్డి భూమిని పలు వాయిదాల కింద డబ్బులు అంటూ అక్రమార్గంలో నిందితుడైన జాటోత్ వీరన్న భూమిని వశం చేసుకున్నాడు ఆ భూమి సాగుకు అనుకూలంగా లేదని, పక్కనే ఉన్న వెంకట్ రెడ్డి భూమిని కబ్జా చేసి హద్దులు మార్చి ఈ భూమే కొనుగోలు చేసినన్నట్లుగా భయ బ్రాంతులకు గురి చేస్తూ పలు దఫాలు దౌర్జన్యాలు దాడులకు పాల్పడిన ఘటనలలో రూరల్ పోలీస్ స్టేషన్ లో వీరన్న అతని తమ్ముడు ఉపేందర్, అల్లుడు జర్పల సురేష్, భార్య చిన్నిలపై పలు సెక్షన్ల కింద కేసులు నమోద య్యాయి. 2021లో ఇదే భూ వివాదంలో వీరన్న ఆగడాలకు వెంకట్ రెడ్డి సోదరుడు భూపాల్ రెడ్డి పురుగుల మందు తాగి మృతి చెందాడు ఆ కేసులో ప్రధాన నిందితుడుగా వీరన్నపై కేసు నమోదైంది. ఇప్పటికే వీరన్నపై పది కేసులపైగా నమోదయి ఉన్నాయి. తమ్ముడు భూమిని కొనుగోలుచేసి అన్న భూమిని కబ్జాకు పాల్పడుతూ ట్రాక్టర్ సహాయంతో దౌర్జన్యంగా వరి సాగు చేస్తుండగా రైతు వెంకట్ రెడ్డి ఆపేందుకు ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. పలు దపాలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగంగ తిరగంగా పోలీసులు కేసు నమోదు చేసి కేసును నిర్లక్ష్యంగా నీరుగార్చారు. దీంతో మనస్థాపానికి గురైన రైతు వెంకటరెడ్డి ఆదివారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే నిందితుడైన వీరన్న, సోదరుడు ఉపేందర్ ట్రాక్టర్ తో పొలాన్ని దౌర్జన్యంగా దున్నుతున్న దృశ్యాన్ని చూసి తట్టుకోలేక ట్రాక్టర్ ను ఆపమని వేడుకున్న లెక్కచేయకుండా దున్నుతుంటే ఉపేందర్ ఆపు ఉపేందర్ ఆపవా అని తీవ్ర మనస్థాపానికి గురై పొలం వద్దే ఉన్న పురుగులు మందు తాగుతూ సెల్ఫ్ వీడియో తీశాడు. ఇది ఆలస్యంగా గమనించిన చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో అపస్మారక స్థితిలో ఉన్న వెంకటరెడ్డిని హుటాహుటిన ఖమ్మంలోని శ్రీరక్ష సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వెంకటరెడ్డిని పరీక్షించిన వైద్యులు ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని తెలిపారు. భార్య పిల్లలు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పలు కేసుల్లో నిందుతుడిగా ఉన్న మాజీ నక్సలైట్ జాటోత్ వీరన్న పై చర్యలు తీసుకోకుండా ఖమ్మం రూరల్ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల తనకు న్యాయం జరగదేమోనని ఆందోళన చెంది ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. రైతు వెంకట్ రెడ్డికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking