ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి డిసెంబర్ 20 : సి.ఎం.కప్ -2024 పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఉషోదయ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలకు జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారి కీర్తి రాజ్ వీరు,జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి,రాజేశ్వరి, జిల్లా సంక్షేమశాఖ అధికారి రౌộఖాన్తో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సి. ఎం.కప్ -2024 పోటీలను జిల్లాలో విజయవంతం చేసే దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. క్రీడా పోటీల నిర్వహణ కొరకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగిందని,జిల్లా స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఈ నెల 27వ తేదీ నుండి జనవరి 2, 2025 వరకు రాష్ట్ర స్థాయిలో జరగనున్న పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.క్రీడలతో ఆరోగ్యంగా ఉండడంతో పాటు విద్య,ఉపాధి రంగాలలో రాణించేందుకు ఏకాగ్రత పెంపొందుతుందని, జీవితంలో ఎంచుకున్న ఉన్నత స్థానానికి ఎదిగేందుకు దోహదపడుతుందని అన్నారు.క్రీడాకారులు గెలుపు,ఓటములను సమానంగా తీసుకుని క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు,శిక్షకులు, క్రీడాకారులు,విద్యార్థినీ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.