గాంధీభవన్ ప్రజాబలం ప్రతినిధి:కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి 119 నియోజకవర్గాలలో భారీగా ధరఖాస్తులు నమోదయ్యాయి. వివిధ జిల్లాల నుండి కీలక నేతలు,గతంలో పోటీ చేసిన వాళ్లు, ఆశావాహులు, పలువురు పారిశ్రామికవేత్తలు, సోషల్ వర్కర్లు, కుల సంఘాల నేతలు నగరంలోని గాంధీభవన్ లో దరఖాస్తు చేసుకున్నారు.ప్రతి నియోజకవర్గానికి సగటున 8-9 మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాలకు పలువురు దరఖాస్తు చేశారు.ప్రతి రోజు దరఖాస్తులకు గాను గాంధీ భవన్ కు ఆశావాహులు పోటెత్తారు .దీంతో కాంగ్రెస్ పార్టీలో నూతనో త్సాహం వచ్చింది.శుక్రవారం దరఖాస్తు చేసుకున్న వారిలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, సీతక్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, సిడబ్యుసి సభ్యులు దామోదర రాజా నర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, సర్వే సత్యనారాయణ, బలమూరి వెంకట్ తదితరులున్నారు.