ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి(బి) వద్ద గల మైనార్టీ స్కూల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ విద్యార్థి మృతికి దారి తీసింది. అక్కడి స్థానికుల కథనం ప్రకారం మైనార్టీ స్కూల్లో ఇద్దరు విద్యార్థులు 10 పదవ తరగతి చదువుతున్నారు. అనుకోకుండా గొడవ వారిద్దరి మధ్యలో మొదలై మాటా… మాట పెరిగి ఒకరినొకరు తోసుకోవడంతో అర్బాజ్(16) అనే విద్యార్థి మృతి చెందాడని పేర్కొన్నారు.విద్యార్థి మృతదేహాన్ని నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.