జగిత్యాల, మార్చి 3: బిజెవైఎం జగిత్యాల రూరల్ మండల కార్యదర్శిగా దీకొండ అజయ్ నియమితులయ్యారు. బిజెవైఎం లో చురుకైన కార్యకర్తగా పనిచేస్తున్న అజయ్ ను కార్యదర్శిగా నియమించడం జరిగిందని రూరల్ మండల అద్యక్షులు పూదరి శ్రీనివాస్ తెలిపారు. అజయ్ నియామకముపై చేనేత సెల్ జిల్లా కన్వీనర్ కొక్కుల గణేష్, బిజెవైఎం జిల్లా అధికార ప్రతినిధి కురుమ రమేష్, రూరల్ మండల అధికార ప్రతినిధి వొల్లాల రాజశేఖర్ గౌడ్ లు అభినందించారు.