నా నియోజకవర్గ ప్రజలందరితో పాటుగా వివిధ ప్రభుత్వ అధికారులందరిని నా కుటుంబ సభ్యులుగా బావిస్తా ఎమ్మెల్యే కందాళ..
ఖమ్మం ప్రతినిధి మే 31 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామం బివి రెడ్డి పంక్షన్ హాల్లో నియోజకవర్గం లోని వివిధ శాఖల ప్రభుత్వ అధికారులతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల గురుంచి సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ 21రోజుల పాటు మన తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఇప్పటి వరకు ఏం చేసిందే ప్రతి ఒక్కరికి తెలియజేయాలి.ప్రతి ఒక్క అధికారి తమ బాధ్యతగా ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కోరారు.