29న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు లు మేడి గడ్డ ప్రాజెక్టు సందర్శన.

 

ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మంత్రులు మెడిగడ్డ బయలుదేరుతారు..

మెడిగడ్డ బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేస్తారు.

ప్రాణహిత ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల జరిగిన లాభ, నష్టాలు..

కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం.. కొత్త ఆయకట్టు, స్థిరీకరణ ఆయకట్టు వివరాలు..

ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్..

మెడిగడ్డ, సిందిళ్ళ, అన్నారం బ్యారేజ్ ల సమస్యలు, వాటి పరిష్కారాలు..తదితర అంశాలపై సమీక్ష..

కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై పవర్ పాయింట్ ప్రాజెక్టు అనంతరం మెడిగడ్డ, అన్నారం బ్యారేజ్ లను సందర్శించి పరిశీలన చేయడం జరుగుతుంది.

ఈ పర్యటన కు సంబంధించి నిర్మాణ సంస్థలకు సబ్ కాంట్రాక్టర్లలకు, ఈ నిర్మాణంలో సంబంధం ఉన్న వారికి అందరికి సమాచారం ఇచ్చి సమావేశంలో పాల్గొనేలా చర్యలు తీసుకోగలరని ఈ.ఎన్. సి ని ఆదేశించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..

ఈ సమీక్షను పర్యటనను కవర్ చేయడానికి మీడియాకు అవసరమైన ఏర్పాట్లు చేయగలరని. సమాచార పౌర సంబంధాల శాఖకు తగిన సమాచారం ఇవ్వాలని మంత్రి ఆదేశించారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking