వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ ను బల్దియా కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ…
ప్రజాబలం వరంగల్ ప్రతినిధి మార్చి14//
జీ డబ్ల్యు ఎం సి కమిషనర్ గా అశ్విని తానాజీ వాకడే ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) గా విధులు నిర్వహిస్తున్న అశ్విని తానాజీ వాకడే ను బల్దియా కమిషనర్ గా బదిలీ చేశారు. గతంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా షేక్ రిజ్వాన్ బాషా జనగాం జిల్లా కలెక్టర్గా బదిలీ అవడంతో జి డబ్లు ఎంసీ కమిషనర్ స్థానంలో అశ్విని తానాజీ వాకడే ను ప్రభుత్వం కమిషనర్ గా నియమించింది. అతి త్వరలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.