జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 24 : మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ నియోజకవర్గాల పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎన్నికలలో భాగంగా ఈ నెల 27 వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగనున్న పోలింగ్ కొరకు బ్యాలెట్ బాక్స్ లో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని వీడియో కాన్రెన్స్ హాల్ నందు జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల,బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు శ్రీనివాస్ రావు,హరికృష్ణలతో కలిసి ఎన్నికల విభాగం అధికారులు,గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ ర్యాండమైజేషన్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 27న జరుగనున్న శాసనమండలి సభ్యుల ఎన్నికల పోలింగ్ నిర్వహణ కొరకు ర్యాండమైజేషన్ చేయడం జరిగిందని తెలిపారు.పట్టభద్రుల ఎన్నికల కొరకు 48 జంబో బ్యాలెట్ బాక్స్ లో కేటాయించగా అందులో 8 అదనపు బాక్స్ లో,48 స్మాల్ బ్యాలెట్ బాక్స్లు కేటాయించగా అందులో 8 అదనపు బాక్స్ లో ఉపాధ్యాయుల ఎన్నికల కొరకు 44 స్మాల్ బ్యాలెట్ బాక్స్ లో కేటాయించగా అందులో 8 అదనపు బాక్స్ లో కేటాయించడం జరిగిందని తెలిపారు.జిల్లాలో 40 పట్టభద్రులు,18 ఉపాధ్యాయ ఎన్నికల కొరకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ నెల 26వ తేదీన ఉదయం 10 గంటలకు ర్యాండమైజేషన్ ప్రక్రియలో కేటాయించిన ప్రకారంగా జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో బ్యాలెట్ బాక్స్ లో ఇతర సామాగ్రి పంపిణీ చేయడం జరుగుతుందని,భద్రతా చర్యల మధ్య పోలింగ్ కేంద్రాలకు తరలించడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేలా అధికారులు,ఏజెంట్లు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.