ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 5 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు సూచించారు లోతట్టు ప్రాంతాలు వాగులు చెరువుల వెంబడి వరద తాకిడితో ఎలాంటి నష్టం జరగకుండా అక్కడి అధికారులు అప్రమత్తం చేయాలని సూచించారు ఉమ్మడి జిల్లా అధికారులు సిబ్బంది నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ వరద సహాయక చర్యలను చేపట్టాలని అన్నారు ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ప్రతిఒక్కరినీ అప్రమత్తం చేయాలని కోరారు