తూప్రాన్, ఎప్రిల్,15. ప్రజాబలం న్యూస్ :-
తూప్రాన్ బస్టాండ్ వద్ద ఎస్ఐ శివానందం ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎన్నికల నిబంధనలో భాగంగా హైద్రాబాద్ ఉప్పల్ కు చెందిన ఎలుక శ్యామల భర్త బాలరాజు కు చెందిన లక్ష రూపాయల నగదు సీజ్ చేసి సదరు మహిళ శ్యామలకు రశీదు ఇచ్చినట్లు ఎస్ ఐ శివానందం తెలిపారు. వాహనాలు తనిఖీ చేసిన వారిలో ఏ ఎస్ ఐ లక్ష్మీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.