హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 22
జమ్మికుంట పట్టణంలోని శ్రీ సాయి వికలాంగుల పాఠశాల నందు జమ్మికుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పొనగంటి. సంపత్ -శ్రీలత కుమారుడు సాత్విక్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్వహకులు మాట్లాడుతూ సాత్విక్ జన్మదిన సందర్భంగా విద్యార్థులకు భోజన ఏర్పాటు చేశారని, పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారని తెలిపారు. సాయి వికలాంగుల పాఠశాల ప్రారంభించినప్పటి నుండి కన్నీటి వరకు పాఠశాలకు అన్ని సహాయ సహకారాలు అందిస్తున్న పొనగంటి సంపత్ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్టు వారు తెలిపారు.