ప్రజాబలం దినపత్రిక
మెదక్ -రామయంపేట్
24.09.2024
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఎన్.ఎస్.ఎస్ డే ను పురస్కరించుకొని కళాశాల ప్రాంగణంలో న్. ఎస్. ఎస్ వాలంటీర్లు శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలోని ఉద్యాన వనంలో ఉన్నటువంటి పిచ్చి మొక్కల న్ని తొలగించారు. ప్లాస్టిక్ తదితర వ్యర్థ పదార్థాలన్నింటిని ఏరివేసి కళాశాల ప్రాంగణమంతా శుభ్రపరచారు. ఈ స్వచ్చత కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హిమజ్యోతి ఎన్,ఎస్, ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పి.బాలా గౌడ్ కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.