కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలి సీఎం రేవంత్ రెడ్డి

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 24 : మంచిర్యాల జిల్లాలోని ఉమ్మడి అదిలాబాద్-మెదక్ -నిజామాబాద్-కరీంనగర్- పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వూట్కూరి ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రోజున నస్పూర్ కలెక్టరేట్ ఎదురుగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు.ఈ సభకు హాజరైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఎమ్మెల్యేలు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి,బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుమార్,మాజీ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంత్రులు మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వూట్కూరి నరేంద్ర రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు,పట్టణ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ వివిధ మండల అధ్యక్షులు,మహిళా మండల అధ్యక్షురాలు,వివిధ గ్రామంలో నాయకురాలు,కార్యకర్తలు పాల్గొన్నారు.