జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి మే 8
పార్లమెంట్ ఎన్నికలు మరో మూడు రోజులు మిగిలి ఉండడంతో గ్రామాలలో ప్రధాన పార్టీలు జోరుగాప్రచారం కొనసాగిస్తున్నాయి.ప్రచారంలో భాగంగా జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారాన్ని నాయిని రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన వెలిచాల రాజేందర్ రావు కి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కంకటరవీందర్, రాజు, అజయ్, ముక్కిడి సాయికుమార్, కార్యకర్తలు పాల్గొన్నారు.