ఈనెల 6న జరిగే పాలేరు నియోజకవర్గ యాదవుల విస్తృత స్థాయి సమావేశమును జయప్రదం చేయండి

 

కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ నాయకులు

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి2 (ప్రజాబలం) ఖమ్మం అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఈనెల 6 వ తారీఖున ఎస్ ఆర్ బ్రదర్స్ ఫంక్షన్ హాల్, కూసుమంచిలో పాలేరు నియోజకవర్గం స్థాయి యాదవులు, గొర్రెల పెంపకం దారుల సమావేశం జరుగుతుందని, యాదవుల గొర్రెల పెంపకం దారుల సమస్యల పరిష్కారం కొరకు జరిగే ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయ వలసిందిగా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ పిలుపునిచ్చారు ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరిలో పాలేరు నియోజకవర్గ స్థాయి యాదవుల విస్తృత స్థాయి సమావేశము కొరకు కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం అఖిల భారత యాదవ మహాసభ నాయకులు మాట్లాడుతూ ఏ పార్టీ అయినా అధికారంలోకి రాకముందు యాదవులకు అనేక హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారే తప్ప యాదవులకు ఎప్పుడు న్యాయం చేయలేదని, యాదవుల కులవృత్తి అయిన గొర్రెల పెంపకం ను అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చి, చివరికి మోసం చేస్తున్నారని మనం వాటిని భరించటం మనకు అలవాటైందని ముఖ్యంగా యాదవులు ఐక్యంగా నిలబడి సమస్యలకు పోరాటం చేయకపోవడం కూడా ఇందుకు ప్రధాన కారణం అని పేర్కొన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లో యాదవులకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా గొర్రెల పెంపకం దారులకు న్యాయం చేయాలని, చేయని పక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఐక్యంగా సమస్యలపై యుద్ధాన్ని చేస్తామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొరిమేకల నాగేశ్వరరావు, సోమనబోయిన లింగయ్య మారుతీ ఎట్టయ్య, పొదిలా సతీష్,గోనె వెంకటనారాయణ గజ్జి సూర్య నారాయణ, మెండెం వెంకటేశు గొల్లన వీరభద్రం, నాగన బోయిన నాగరాజు, మాలెపు కృష్ణయ్య, బుర్ర రాధాకృష్ణ, కాశయ్య బొల్లినేని నాగేశ్వరరావు, బట్టు మధు, మాగంటి చందర్ రావు, మాగంటి కేశవరావు అశోక్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking