అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి లోడిగ వెంకన్న యాదవ్ ను పరామర్శించిన డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్
ఖమ్మం ప్రతినిధి మార్చి 13 (ప్రజాబలం) ఖమ్మం తీవ్ర అస్వస్థతకు గురై గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రధాన అనుచరుడు లోడిగ వెంకన్న యాదవ్ ను అఖిలభారత యాదవ మహాసభ జిల్లా గౌరవాధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్, జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య, జిల్లా యాదవ యువజన అధ్యక్షులు చిత్తూరు సింహాద్రి యాదవ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ ఫతే మహమ్మద్ లు ఖమ్మంలోని వారి స్వగృహంలో పరామర్శించారు వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు. కుదుటపడినాక తిరిగి యాదవ సంఘాలను బలోపేతం చేసే దిశగా ప్రయత్నించాలని కోరారు