వరంగల్ ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 9:
దేశ పెట్ రోడ్డు వర్తక సంఘం సర్వ సభ్య సమావేశం శుక్రవారం సంఘం శాశ్వత అధ్యక్షులు లయన్ ఆడెపు రవీందర్ నేత ఆధ్వర్యంలో 11వ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా కేక్ కట్ చేసిన ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా 129 మంది సబ్యులతో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమలు, ఉచిత మెడికల్ క్యాంపులు, ఉచిత మందుల పంపిణీ, వృద్ద ఆశ్రమంలో బియ్యం పంపిణీ, గణపతి నవరాత్రులలో నిత్య అన్నదానం, నిర్వహిస్తామని తెలిపారు అలాగే ఈ సంవత్సరం అందరూ దంపతులకు 10 గ్రాముల చొప్పున బంగారు బిల్లలు దించడం జరుగుతుందని అందరి సభ్యుల సహకారంతో అన్ని కార్యక్రమాలను ఉత్సాహంగా దిగ్విజయభరితంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి వీర రౌతు విజయభాస్కర్ రెడ్డి, కోశాధికారి శిరుప మాధవ్ కుమార్, ఉపాధ్యక్షులు సురేష్ కుమార్ జోషి, విజయ భాస్కర్ రెడ్డి, మార్గం నాగరాజు అశోక్ బసవరాజు కుమార్ గోరంట్ల రవి ప్రసాద్, సంయుక్త కార్యదర్శి ఆర్గనైజర్లు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.