మతోన్మాద బిజెపి మద్దతిచ్చే బీఆర్ ఎస్ లను గద్దెదింపుతాం
వంచిత్ బహుజన అఘాడి రాష్ట్ర కో ఆర్డినేటర్ విజయ్ కుమార్
జగిత్యాల, ఫిబ్రవరి 22: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బహుజనులందరికి మేలు జరగాలన్నా, రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలన్న బహుజన రాజ్యంలోనే సాధ్యమవుతుందని వంచిత్ బహుజన అఘాడి రాష్ట్ర కో ఆర్డినేటర్ డా. బండి విజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణా లో బహుజనులు ఎక్కువగా ఉన్నారని ఏండ్లు గడుస్తున్నా బహుజనుల్లో అభివృద్ధి లేదన్నారు. బహుజనులు ప్రయోజనాలకోసం అంబేద్కర్ కుటుంబ పార్టీ అవసరం ఇక్కడ ఉందని గుర్తించారన్నారు. మహారాష్ట్రలో శివసేనతో పొత్తు కొనసాగిస్తున్నామని తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. దాదాపు 60 సీట్లలో విబిఏ అభ్యర్యులు బరిలో ఉంటారన్నారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ మతోన్మాదాన్ని పెంచిపోషిస్తోందని రాష్ట్రంలో బీజేపీని వ్యతిరేకిస్తున్నామని చెప్పే బి.ఆర్.ఎస్. మతోన్మాదాన్ని అనచిన దాఖలాలు లేవన్నారు. త్వరలో నిజాం గ్రౌండ్స్లో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి బహుజనుల్లో ఐక్యతను చాటుతమన్నారు. రాష్ట్రంలో దేశంలో బడుగు, బలహీన మైనార్టీ, షెడ్యూల్ కులాలను కేవలం ఓటు బ్యాంకుగా, చిన్న పతకాలకు లబ్ధిదారులుగా ప్రభుత్వాలు మార్చుతున్నాయని విజయ్ కుమార్ చెప్పారు. ఆచరణలో ఎక్కడను అంబేద్కర్ విధానాలు అమలు కావడం లేదని దేశంలో, రాష్ట్రంలో పరిపాలనలో ముఖ్యమైన పోస్టుల్లో దళిత ఐఏఎస్, ఐపీఎస్ లకు పోస్టింగులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 8 ఏండ్ల కాలంలో దళితులు అభివృద్ధిలో వెనుకబడి ఉన్నారని, దళితులకు 3 ఎకరాల భూమి భూటకమన్నారు. అగ్రకుల ప్రాజెక్టులకు కోట్ల రూపాయలు ఇస్తూ దళితబందుకు నిధుల కొరత పెట్టారన్నారు. ఎస్సి, ఎస్టీ చట్టం నిర్వీర్యం అయ్యిందని, ఎస్సి కార్పొరేషన్ ఉనికి కోల్పోయిందన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ప్రైవేటు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు లేవన్నారు. రాష్ట్రం తీరు ఇలావుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలో మతోన్మాదాన్ని పెంచిపోషిస్తూ మనుధర్మ శాస్త్రం అమలుకు శ్రీకారం చుట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో రిజర్వేషన్లు లేకుండా చేస్తూ బడుగు, బలహీన, దళిత, మైనార్టీల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చాలని చేస్తోందన్నారు. మనువాద పార్టీలను గద్దె దించడం బాబాసాహెబ్ అంబేడ్కర్ కుటుంభంతోనే సాధ్యమవుతుందని వంచిత్ బహుజన్ అఘాడి పార్టీని బలోపేతం చేయాలని వంచిత్ బహుజన అఘాడి రాష్ట్ర కో ఆర్డినేటర్ డా. బండి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ గవ్వల శ్రీకాంత్, తీగల శేఖర్, దాసరి వెంకటి, భూమ్ రాజ్, మహేందర్ లు ఉన్నారు.