ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 13 (ప్రజాబలం) ఖమ్మం సోమవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలను పురస్కరించుకుని భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13 నుండి 17 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు బ్యానర్లు పోస్టర్లను అన్ని బ్యాంకుల బ్రాంచుల్లో శిక్షణా కేంద్రాల్లో ప్రదర్శించి విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సులు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్నేహాలత మొగిలి ఎన్. మధుసూదన్ ఎల్డిఎం శ్రీనివాస రెడ్డి జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.