జిల్లా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పిర్యాదిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీ.సిహెచ్.ప్రవీణ్ కుమార్ ఐపిఎస్..
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా… ప్రజలకు అవసరమైనపుడు పోలీసు స్పందనపైనే ప్రదానంగా దృష్టసారిస్తానని జిల్లా ఎస్పీ గారు పేర్కొన్నారు, సోమవారం స్థానిక పోలీసు కార్యలములో ఎస్పీ గారి అద్వర్యంలో ప్రజా పిర్యాదుల విభాగం నిర్వహించారు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పిర్యాదుదారులు హాజరై సమస్యలను తెలియజేసి అర్జిలను సమర్పించారు, వారికి అప్యాయంగా పలకరించి ఓపిగ్గా సమస్యలను తెలుసుకొని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఆదేశించారు,
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ… ప్రజలు నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకుంటూ, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకొనేల, పోలీసులకు ప్రజలకు సంబంధాలు మెరుగుపరుస్తూ శాంతి భద్రతలు పరి రక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తరుణంలో ప్రజా సమస్యలు పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజాదివస్ కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నాము. అనుమాస్పదన వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని దృష్టికి వస్తే వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేయాలి లేదా జిల్లా వాట్సప్ నెం.8712659599కు సమాచారం తెలియజేయాలని కోరారు.