హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఎన్నికైన సందర్భంగా చిన్ననాటి స్నేహితులు శాలువా, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా చిన్ననాటి స్నేహితుడు బీఆర్ఎస్ నుంచి హైదరాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఆయన గెలుపు కోసం అందరం కృషి చేస్తాం అన్నారు.
