గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరను ఘనంగా నిర్వహించాలి

 

మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాసరావు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 10 : జిల్లాలోని క్యాతన్ పల్లి మున్సిపల్ పరిధిలో ఈ నెల 14 నుండి 16వ తేదీ వరకు జరుగనున్న గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ఘనంగా నిర్వహించాలని మంచిర్యాల రాజస్వ మండల అధికారి శ్రీనివాస్ రావు అన్నారు.సోమవారం జిల్లా కేంద్రంలోని రాజస్వ మండల అధికారి కార్యాలయంలో బెల్లంపల్లి ఎ.సి.పి. ఎ.రవికుమార్,మందమర్రి తహశిల్దార్ సతీష్కుమార్, క్యాతన్పల్లి మున్సిపల్ కమీషనర్ రాజు,మందమర్రి సి.ఐ.కె.శశీర్ రెడ్డి,జిల్లా అగ్నిమాపక అధికారి భగవాన్రెడ్డి, ఆదివాసీ సంఘ నాయకులు, జాతర కమిటీ ప్రతినిధులతో జాతర నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజస్వ మండల అధికారి మాట్లాడుతూ…ఈ నెల 14 నుండ 16వ తేదీ వరకు జరుగనున్న గాంధారి ఖిల్లా మైసమ్మ జాతరను విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. మున్సిపల్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్యం, త్రాగునీరు,రోడ్ల మరమ్మత్తు చర్యలు నిర్వహించాలని,అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తులకు భోజన ఏర్పాట్లు చేయాలని,అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలనతో పాటు మున్సిపల్ శాఖ సమన్వయంతో పార్కింగ్ నిర్వహణ చేయాలని తెలిపారు.వైద్య-ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య సిబ్బందిని నియమించాలని,అత్యవసర వైద్య సేవల నిమిత్తం అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని,అటవీ ప్రాంతం అయినందున యాంటీ వెనం ఇంజక్షన్ను అందుబాటులో ఉంచాలని,సి.పి.ఆర్. బృందం ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణపై పోలీసు శాఖ అధికారులు పర్యవేక్షించాలని,ప్రముఖుల సందర్శనకు అనుగుణంగా తగు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.ఆదివాసీ సంఘాల నాయకులు,జాతర కమిటీ ప్రతినిధులు అధికార యంత్రాంగానికి సహకరిస్తూ జాతర ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగే విధంగా సహకరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking