నాంపల్లి మండలం తహసీల్దార్‌ ను సత్కరించిన గోషామహల్‌ కాంగ్రెస్‌ నాయకులు

నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి: బుధవారంనాడు నాంపల్లి మండలం తహసీల్దార్‌ గా బదిలీపై వచ్చిన నయీమ్‌ ఉద్దీన్‌ ని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించడం జరిగింది, తదనంతరం గోషామహల్‌ నియోజకవర్గం డెవలప్మెంట్‌ ఫోరమ్‌ తరఫున దాదాపు 100మంది కుటుంబాలను నిరుపేదలుగా గుర్తించిన జాభితాను అధికారికంగా ఎస్‌ ఇ ఎస్‌ నిర్వహించి అతి నిరుపేదలుగా గుర్తించిన జాభితాను మాకు అందించవలసిందిగా కోరిన వెంటనే సానుకాలతను తెలియ చేసారని బద్దం సతీష్‌ గౌడ్‌ కన్వీనర్‌ నియోజకవర్గం డెవలప్మెంట్‌ ఫోరమ్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు తెలిపారు, ఈకార్యక్రమంలో నిర్మల్‌ కుమార్‌ యాదవ్‌ ఏఐసీసీ ఓబీసీ జాయింట్‌ కన్వీనర్‌, డాక్టర్‌ వంజరి శ్రీనివాస్‌ సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు,చేతనే యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు, కామలుద్దీన్‌ సేవాదళ్‌ నాయకులు, రాధా కృష్ణ, సీనియర్‌ నాయకులు తదితరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking