ఘనంగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

 

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 15 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని పూలే ప్రాంగణంలో సంతు శ్రీ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి ఉత్సవాలను బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించటం జరిగింది . గొప్ప సంఘసంస్కర్త తన రచనలతో, పాటలతో సంచార జీవితం సాగిస్తున్న బంజారాలను ఒక దగ్గరకు చేరదీసి ప్రకృతి కి అనుగుణంగా ఎలా బతకాలో, సంఘటితంగా ఎలా ఉండాలో బోధనలు చేసిన మహానుభావుడు .
అంతేకాకుండా ఆ రోజుల్లో మూఢనమ్మకాలు , జంతుబలులను వ్యతిరేకించినటువంటి సామాజిక సంస్కర్త . ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు రెండు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు . 8వ షెడ్యూల్లో బంజారాల భాష అయినటువంటి గోరో బోలో ను పొందుపరచాలని , అలాగే ఫిబ్రవరి 15వ తేదీని సెలవు దినంగా ప్రకటించాలని , 10 కోట్లకు పైగా ఉన్న బంజారాలు ఇప్పటికీ దుర్భరమైన జీవితాన్ని గడుపుచున్నారు వారికి కేటాయించిన బడ్జెట్ ను వారికే ఖర్చు చేయాలి బంజారాలంతా ఐకమత్యంగా రాజ్యాధికార సాగాలని సంత్ శ్రీ సేవాలాల్ ఆశయానికి అనుగుణంగా నడుచుకోవాలని కోరారు

Leave A Reply

Your email address will not be published.

Breaking