జియాగూడలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

జాతీయ జెండా ఆవిష్కరించిన ఉస్మాన్ బిన్ మహమ్మద్ అల్ హజ్రి

కార్వాన్‌ ప్రజాబలం ప్రతినిధి:  జియాగూడలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆరె కటిక చర్మకష్ సంఘం ఆద్వర్యంలో కమేళాలో నిర్వహించిన వేడుకల్లో కార్వాన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ ఉస్మాన్ బిన్ మహమ్మద్ అలి హజ్రి పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చర్మకష్ సంఘం నాయకులు పి దర్శన్ కుమార్, వి శశికాంత్ రావు, ఎం బాలాజి, సాయి కుమార్, హరికిషన్, సుదేష్, ఆరె కటిక సంఘం నాయకులు టి నర్సింగ్ రావు, దివాకర్ లాల్, వి నాగేష్, రూపేష్ రాజ్, వి సత్యం, జ్ఞానేశ్వర్, గురుదాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking