రాజేంద్ర నగర్ ప్రజాబలం ప్రతినిధి:రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గండిపేట మండల కేంద్రంలోని మనికొండ మునిసిపల్ కౌన్సిల్ నిధుల ద్వారా కట్టిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బుధవారం 2023 జనవరి 04 న ఆదిగా గణేశ్ నృత్య గానాలతో పాటు విద్యార్థినీ విద్యార్థుల తెలంగాణ బోనాలు, పోతారజుల ఆటపాటలతో రంజింప జేసిన తరువాత తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖమాత్యులు సబితా ఇంద్రా రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి మరియు స్థానిక శాసన సభ్యుడు టీ. ప్రకాష్ గౌడ్ లతో పాటు స్థానిక ఛైర్మన్ కస్తూరి నరేందర్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, బీ ఆర్ ఎస్ పార్టీ స్థానిక కౌన్సిలర్, పార్టీ ఫ్లోర్ లీడర్ కే. రామకృష్ణ రెడ్డి, ఆల్ కాలనీ ఫెడరేషన్ అధ్యక్షుడు సీతారామ్ ధూళిపాళ లు ప్రారంభోత్సవమ్ జరిపినారు, ఈ సమయమ్లో విచ్చేసిన అతిథులకు పాఠశాల సిబ్బంది, బీ ఆర్ ఎస్ మనికొన్డ నాయకులు కార్యకర్తలే కాకుండా వీ ఆర్ ఫర్ యు వయోజన సంస్థ సభ్యులు సన్మాణం చేసినారు, ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ ఫాల్గుణ కుమార్, కౌన్సిల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు కౌన్సిలర్లు, వివిధ పార్టీల ప్రజా నాయకులు, మహిళా నాయకురాల్లు, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సభను జయప్రదం గావించారు.
