ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 11 (ప్రజాబలం) ఖమ్మం మహాత్మా జ్యోతిబా ఫూలే 197వ జయంతి వేడుకలను నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ సమీపంలో గల ఆయన విగ్రహం వద్ద జన తెలంగాణ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా యూత్ క్లబ్ అధ్యక్షులు కందుకూరి మహేష్, కార్యదర్శి మొఘపోతుల హర్షవర్ధన్, సలహాదారులు కంబాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులార్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నాడు భారతదేశంలో బడుగు,బలహీన వర్గాలవారిపై కులవివక్షత ఎక్కువగా ఉండేదని, ఆ కులవివక్షత, అంటరానితనం రూపుమా పూటకు జ్యోతి రావు ఫూలే ఎంతగానో కృషి చేశారని అన్నారు. జ్యోతిబాఫూలే ని నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకుసా గాలని వారు కోరారు. ఈ కార్యక్రమం లో కంబాల శివాజీ, సాయికిరణ్, కందుకూరి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు