మూసాపేట్‌ లో కెటీఆర్‌ జన్మదిన వేడుకలు

కుకట్‌పల్లీ ప్రజాబలం ప్రతినిధి:బిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌,మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా కూకట్‌ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశానుసారం మూసాపేట్‌ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద మాజీ కార్పోరేటర్‌ తూము శ్రావణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్‌ శ్రేణులు, అభిమానులు కేక్‌ కటింగ్‌ చేశారు.ఈ సందర్భంగా శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలిపి,తన ముందుచూపుతో హైదరాబాద్‌ మహానగర రూపురేఖలు మార్చి, తనదైన ముద్ర వేసుకున్న విజనరీ లీడర్‌ కేటిఆర్‌ అని, ఆయన అన్నారు.
కార్యక్రమంలో డివిజన్‌ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్‌, జిల్లా గోపాల్‌,నపారి చంద్రశేఖర్‌,సుందర్‌ , కూకట్పల్లి బి.ఆర్‌.ఎస్‌ సీనియర్‌ నాయకులు నర్సింగ్‌ రావు, బాబు రావు,తుకారాం, విష్ణు, నర్సింహ ,రవి సింగ్‌, ఆశీర్వాదం, మనోజ్‌ ,జైరాజ్‌ , అరుణ్‌, కృష్ణ, అర్జున్‌ ,మల్లేష్‌, రాంచందర్‌,వీరాచారి, రాము ,రమేష్‌, సురేష్‌, రవి , నరేష్‌, కోటి ,అక్షయ్‌ ,నిఖిల్‌,హితేష్‌ , మహిళా నాయకురాళ్ళు మణేమ్మ, మంగమ్మ, శ్యామల ,సూర్యకళ,హరిత,శాంత, రమాదేవి, సుజాత,పద్మ,లత, శిరీష, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking